అధికారంలోకి రాగానే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం : అఖిలేష్ యాదవ్

-

మరికొన్ని రోజులలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవాళ విడుదల చేశారు.2025 నాటికి రాష్ట్రంలో కుల గణన చేపడతామని అన్నారు.. అలాగే, అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని సమాజ్వాది పార్టీ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామని అన్నారు.

కాగా, 2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, మీడియా స్వేచ్ఛా హక్కు, సామాజిక న్యాయ హక్కు దేశ అభివృద్ధికి కీలకమని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచామని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news