IPL 2024 : లక్నో సూపర్ జెయింట్స్ లోకి రోహిత్ శర్మ?

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన నాటి నుండి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా వేలంలో హిట్మ్యన్ను దక్కించుకోవాలని

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఆయన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్.మరోవైపు వచ్చే సీజన్కు ముంబైని వదిలేయాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news