నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త..

-

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున కడప జిల్లా రాజంపేటలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఓట్లు చీలేందుకు వీల్లేదని తాను జైలులో ఉన్నప్పుడు పవన్ చెప్పారన్నారు. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news