వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్, ఆయన ఆశయాలను పట్టించుకోవట్లేదు : షర్మిల

-

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే, ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆమె మండిపడ్డారు.గత ప్రభుత్వాలు ఆంధ్ర ప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాయని అన్నారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారని షర్మిల అన్నారు.

ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వాషింగ్టన్ డీసీ లా చేస్తానని చెప్పి, రాజధాని లేకుండా చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్, ఆయన ఆశయాలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చాలంటే రైతును రాజు చేయాలని, ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news