ఏం పీకుతున్నావ్ జగన్ ? బాబు సంచనల వ్యాఖ్యలు

-

ఈ రోజు అమరావతిలో రాజధాని జనభేరి అనే సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వెళుతుంటే ఉద్దండరాయని పాలెం వద్దన్నారని నాకు అక్కడికి వెళ్ళే హక్కు లేదా? అని అయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పాడు ఇక్కడ ఇన్ సైడ్ ర్ ట్రేడ్ జరిగింది అన్నారు. అదే నిజమైతే ఈ ముఖ్యమంత్రి ని 18 నెలలు వరకు నిరూపించకుండా ఏం పీకుతున్నావ్ అని అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

నన్ను ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు అన్నావు నువ్వు కట్టుకుని ఏమి సాదించావు అని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీ లు అమరావతి కే మద్దతు ఇచ్చాయి. నువ్వు ఒక్కడివి తప్ప రాజధాని ఎక్కడ ఉండాలని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు మధ్యలో వుండే గుంటూరు జిల్లాలో అని ఆయన అన్నారు, రాష్ట్రం అంతా నాతోనే వుందంటున్నావుగా రెఫరెండం కి వెళదామా అంటూ ముఖ్యమంత్రి కి చంద్రబాబు సవాలు చేశారు. ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news