టీడీపీ నాయకుల కొట్లాట: నంద్యాల గొడవపై చంద్రబాబు సీరియస్…

-

తాజాగా ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ లో వర్గ పోరు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ భూమా అఖిలప్రియకు మరియు ఏవి సుబ్బారెడ్డి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. నిన్న నంద్యాలలో ఈ రెండు వర్గీయుల మధ్యన జరిగిన దాడి కారణంగా వివాదం మరింత పెద్దదిగా మారింది. దీనితో భూమా అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డి కేసు పెట్టడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది . ఈ విషయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు సమాచారం.

పార్టీలో క్రమశిక్షణ చర్యలకు విఘాతం కలిగించే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవపై నిజా నిజాలు తెలుసుకోవడానికి వెంటనే ఒక త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ చెప్పే రిపోర్ట్ ఆధారంగా వారిద్దరిలో ఒకరిపై చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news