బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి భద్రత పెంపు

-

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకి ఇచ్చిన వై కేటగిరి భద్రత కాలం ఇటీవలే ముగిసిందని ఓ అధికారి తెలిపారు. అనంతరం దీనిపై నిబంధనల ప్రకారం రివ్యూ చేసి ఆయనకి జెడ్ కేటగిరి భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

పరిపాలన స్థాయిలో చర్చల అనంతరం బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గంగూలికి జెడ్ కేటగిరి భద్రత అందుబాటులోకి రాగానే కోల్కత్తాలోని బెహలా ప్రాంతంలో గల ఆయన ఇంటి వద్ద ఇప్పుడు 24 గంటలపాటు ఇద్దరు ప్రత్యేక భద్రత అధికారులు కాపలాగా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news