వంగ‌వీటి రాధా ఇంటికి చంద్ర‌బాబు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

వంగ‌వీటి రాధా ఇంటికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెళ్లాడు. వంగ‌వీటి రాధాతో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. అలాగే ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగ ఇటీవ‌ల త‌న హ్య‌త్య కుట్ర జ‌రుగుతుంద‌ని వంగ‌వీటి రాధా చెప్పిన విష‌యం తెలిసిందే. త‌నను హ‌త్య చేయ‌డానికి రెక్కీ నిర్వ‌హించార‌ని మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశి ముందే వంగ‌వీటి రాధా అన్నారు. కాగ ఈ విష‌యం పైనే వంగ‌వీటి రాధాతో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. అనంత‌రం ఏపీ ప్ర‌భుత్వం పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

ఇద్ద‌రు గ‌న్ మెన్లను ఇస్తే స‌రిపోతుందా.. అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రెక్కీ నిర్వ‌హించింది ఎవ‌రో సీసీ కెమెరాల ఆధారంగా విచార‌ణ చెపట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యం పై డీజీపీకి లేఖ రాసినా.. ఇంత వ‌ర‌కు స్పంద‌న లేద‌ని అన్నారు. ఈ విష‌యంలో పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. రెక్కీ గురించి వంగ‌వీటి రాధా మంత్రి స‌మ‌క్షం చెప్పి ఏడు రోజుల గ‌డుస్తున్న ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని అన్నారు. అలాగే వంగ‌వీటి రాధాను జ‌గ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. పార్టీ మ‌ద్ధ‌త్తు త‌ప్ప‌క ఉంటుంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news