చంద్రబాబు టూర్ ఉద్రిక్తత.. గో బ్యాంక్ అంటూ దళితుల నినాదాలు

-

కృష్ణా: గొల్లపూడిలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌తో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు గొల్లపూడి వెళ్లారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత వ్యతిరేకి చంద్రబాబు అంటూ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు వ్యక్తం చేశారు.

దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గమే తమ నేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరోవైపు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించారు. దేవినేని అరెస్ట్‌తో భయాందోళనకు గురైన ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు.

కాగా అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని కుటుంబానికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news