ఈనెల 5 న హైదరాబాద్ కి రానున్న చంద్రబాబు.. గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్న టీటీడీపీ శ్రేణులు

-

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు నాయుడు రానున్నారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నారు.ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.

బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంతో చంద్రబాబుకి ప్రత్యేక సంబంధం ఉందని, ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోందని అన్నార. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం పలకాలని కార్యకర్తలు, నాయకులను పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news