సిఎం జగన్ కీలక నిర్ణయం..అనకాపల్లి, విశాఖ అధ్యక్షుల మార్పు !

-

విశాఖ:- విశాఖ పర్యటనలో ఆసక్తికరమైన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటన చేసారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మార్చుతున్నట్లు ప్రకటన చేశారు. మాజీ మంత్రి అవంతి, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీలను అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టులో నేరుగా అవంతి, ధర్మశ్రీకి ఈ విషయం సీఎం జగన్ చెప్పారు. ఇటీవల మంత్రి వర్గంలో స్థానం ఆశించిన ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని భావించారు అవంతి… అవంతి, ధర్మశ్రీ సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలకు ఉపయోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వీరిద్దరినీ విజయవాడకు సిఎం జగన్ మోహన్ రెడ్డి పిలిపించే అవకాశం కూడా ఉంది. దీని పై ఈ వారంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news