ప్రేమ పేరుతో మోసం చేశాడ‌ని.. యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

-

ప్రేమించిన వాడు మోసం చేశాడ‌ని.. పెళ్లికి నిరాక‌రించ‌డాని యువ‌తి మ‌న‌స్థాపానికి గురి అయి ఆత్మ హ‌త్య చేసుకుంది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని దంతాల‌ప‌ల్లి మండ‌లం పెద్ద ముప్పారంలో చోటు చేసుకుంది. కాగ పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన శ‌ర‌ణ్య (22).. అదే గ్రామానికి చెందిన ఒక యువ‌కున్ని ప్రేమించింది. చాలా రోజుల పాటు ప్రేమించుకున్న త‌ర్వాత‌.. పెళ్లి విషయం వ‌చ్చే స‌రికి.. ఆ యువ‌కుడు అంగీక‌రించ‌లేదు.

ఈ విషయం శ‌ర‌ణ్య కుటుంబ స‌భ్యుల‌కు తెలిసి.. పెళ్లికి ఆరు నెల‌ల గ‌డువు పెట్టారు. అయితే ఆరు నెల‌లో కూడా ప్రియుడు పెళ్లికి అంగీక‌రించ‌క పోవడంతో శ‌ర‌ణ్య మ‌న‌స్థాపానికి గురి అయింది. ప్రేమించి మోస‌పోయాన‌ని త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి ముందే ఆ యువ‌కుడి ఊహా చిత్రం గీసి.. ఒక లేఖ రాసి చ‌నిపోయింది.

ఆ లేఖ‌లో.. ”అమ్మ, నాన్న మ‌ళ్లీ మీ ముందు ఓడిపోయా.. అంద‌రి ముందు ఒక ప్ర‌శ్న‌గా మిగిలిపోయా. ఆరు నెల‌లు గ‌డువు పెట్టినా.. త‌న‌ను న‌మ్మి మ‌రో సారి మోస‌పోయా, ఓడిపోయా” అంటూ లేఖ రాసింది. కాగ స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. కేసు న‌మోదు చేసుకున్నారు. అలాగే శ‌ర‌ణ్య రాసిన లేఖ‌ను ఊహా చిత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news