కృష్ణా జిల్లాలో చీటర్ పెళ్ళికొడుకు..వల విసిరి లక్షలు దొచేస్తాడు..!

-

ఈ మధ్యకాలం లో మ్యాట్రిమొని మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన చీటర్ పెళ్లి కొడుకు చీటింగ్ వెలుగులోకి వచ్చింది. జగ్గయ్య పేట కు చెందిన వంశీ కృష్ణ అనే యువకుడు మ్యాట్రి మొని సైట్ లో ఏకంగా ఐదుగురికి వల విసిరి దొచేసాడు. వంశీ కృష్ణ మొత్తం కోటికి పైగా డబ్బులను వారి నుండి వసూలు చేసి మోసం చేశాడు. ఖమ్మం కు చెందిన ఓ యువతి ఫిర్యాదు తో వంశీ కృష్ణ బాగోతం వెలుగులోకి వచ్చింది.marriage

పెళ్లి తర్వాత విదేశాలకు వెళదాం అని చెబుతూ మాయ మాటలతో వంశీ కృష్ణ భారీ మొత్తాన్ని యువతుల నుండి తీసుకున్నట్టు విచారణ లో తెలిసింది. అంతే కాకుండా ఫేక్ ఐడి లకు ఫేక్ ఫోటో లతో వంశీ కృష్ణ ఈ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు జగ్గయ్య పేట పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల విచారణ లో వంశీ కృష్ణ ఆన్లైన్ మోసాలు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news