తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..రూ.300 క్రాస్

-

మాంసం తినేవారికి బిగ్‌ షాక్‌. తెలంగాణలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. విత్ స్కిన్ రూ.280, స్కిన్ లెస్ చికెన్ రూ. 300 కు పెరగడంతో మాంసాహార ప్రియులు షాక్ అవుతున్నారు. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ. 220గా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ. 80 పెరిగింది.

మండే ఎండలతో పాటు కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని, ధరలు పెరిగేందుకు ఇవే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక అటు ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి. సమ్మర్ ఎఫెక్ట్ తో ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి. రూ. 300 వరకు చికెన్‌ ధరలు పెరిగాయి. రూ. 300 వరకు ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ఉంది. ధరలు పెరగడంతో.. సేల్స్ తగ్గాయంటున్నారు షాప్ నిర్వాహకులు.

 

Read more RELATED
Recommended to you

Latest news