ముఖ్యమంత్రి జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఇదే !

-

సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ముఖ్యమంత్రి , వైఎస్‌ఆర్‌ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. రేపు టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో జరిగే బహిరంగ సభల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు.

 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల 30వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ రిలీజ్ చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్ సభ పరిధిలో కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో ,మధ్యాహ్నం12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో ,మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news