గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమే: రఘునందనరావు

-

గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన రావు అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునందనరావు మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రిగా కేసిఆర్ నూరు అబద్ధాలు ఆడితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు.కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టిన విషయం మరవద్దంటూ ప్రజలకు సూచించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎరువుల కొరత అనేదే లేకుండా చూశారని తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు పంపాలని ఈ సందర్బంగా ప్రజలకు రఘునందనరావు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news