చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారు : వెంకయ్య నాయుడు

-

భార‌త ఉప రాష్ట్రప‌తి మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి రాజ‌కీయాలు మానేసి మంచి ప‌ని చేశార‌ని ఉప రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు అన్నాడు. ప్ర‌స్తుతం రాజకీయాలు గ‌తం మాదిరి లేవు అని వెంక‌య్య నాయుడు అన్నాడు. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు అంటే బూతు అయింద‌ని అన్నారు. ఇప్పుడు రాజ‌కీయ భాష సరిగ్గా లేద‌ని వెంకయ్య నాయుడు అన్నాడు. ఈ విధానాన్ని ప్ర‌జ‌లే మార్చాల‌ని ఆకాంక్షించారు. అలాగే త‌న‌కు కూడా ప్ర‌స్తుతం రాజ‌కీయాల మీద ఆస‌క్తి త‌గ్గింద‌ని అన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు త‌న‌కు ఏ మాత్రం న‌చ్చ‌డం లేద‌ని తెలిపారు.

ఉపరాష్ట్రపతి పదవి వల్ల రోజు కొంచం తొందరగా పడుకుంటున్నాని అన్నారు. ప్రజలకు దూరంగా ఉండటం కాస్త ఇబ్బంది గా ఉందని తెలిపారు. అలాగే త‌న‌కు రాష్ట్రపతి కావాలని కోరిక లేదని స్పష్టం చేశారు. ఈ కోరిక నాకు లేదు కానీ నా శ్రేయోభిలాషుల కు ఉంద‌ని అన్నారు. అందు లో మెగాస్టార్ చిరంజీవి ఒక్క‌రు అని అన్నారు. కాగ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు హైద‌రాబాద్ లోని అమీర్ పేట్ లో నూత‌నంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్ ప్రారంభించాడు. ఈ సంద‌ర్భంగా పై వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news