మ‌న‌వ‌రాలి పర్ఫార్మెన్స్‌కు చిరంజీవి ఫిదా..!

-

లాక్‌డౌన్ కార‌ణంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెల‌లుగా ఇంటికే ప‌రిమ‌తం అయ్యారు. క‌రోనా వైర‌స్ నే ప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో ఉల్లాసంగా గడుప‌తున్నారు. ఈక్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేడ్స్‌ను త‌న అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ముఖ్యంగా త‌న త‌ల్లితో, మ‌న‌వ‌రాళ్ళ‌తో చిరు స‌రదాగా గ‌డుపుతున్న‌
అనుభూతుల‌ను ట్విట‌ర్‌, ఇన్‌స్ట‌గ్రామ్ ల‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అల‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా తన మ‌న‌వ‌రాలు సంహిత ‌( చిరు పెద్ద కూతురు సుస్మిత కుమార్తె) రుద్ర‌మ‌దేవి సినిమాలోని డైలాగ్‌ను గాంభీర్యంగా, రాజసంతో చెబుతుంటే ఆ సన్ని‌వేశాల‌ని త‌న మొబైల్‌లో షూట్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి‌. సంహిత డైలాగ్‌లోనే కాదు యాక్ష‌న్ ప‌రంగా అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. దీంతో మ‌న‌వ‌రాలి ప‌ర్‌ఫార్మెన్స్‌కు ముగ్ధుడైన చిరు.. “1990లో సుష్మిత‌, 2020లో సంహిత ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అచ్చంగా త‌ల్లిలాగే కూతురు” అంటూ చిరు ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్య‌క్తం చేశారు. చిన్నారుల అభిరుచిని తల్లి తండ్రులు ప్రోత్సహిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. కాగా, క‌రోనా ఉదృతి త‌గ్గాక చిరంజీవి ఆచార్య, లూసిఫ‌ర్ రీమేక్, వేదాళం రీమేక్‌లో న‌టించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news