చిత్రం 1.1 వెర్షన్లో అందరూ కొత్తవాళ్ళే.. ఏకంగా 45మంది..

-

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు తేజ, ఆ తర్వాత సీత సినిమాతో మళ్ళీ చతికిల పడ్డాడు. అప్పటి నుండి తేజ సినిమాల గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేమీ అధికారికంగా ప్రకటించబడలేదు. తాజాగా తేజ తన మొదటి చిత్రానికి సీక్వెల్ తో వస్తున్నాడు. అసలు చిత్రం సినిమాకి సీక్వెల్ వస్తుందని వార్తలు రాని టైమ్ లో ఈ ప్రకటన రావడం కొంత షాకింగే. చిత్రం 1.1 పేరుతో వస్తున్న ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్ళే ఉంటారని సమాచారం అందుతోంది.

మొత్తం 45మంది కొత్తవాళ్ళు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతారట. తేజ సినిమాల్లో కొత్త వాళ్ళు ఉండడం కామనే. ఆయన చేసిన చాలా సినిమాల్లో కొత్తవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మరి ఇప్పుడు హోరో హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కొత్తవారే ఉంటున్నారు. మరి కొత్తవారితో తీస్తున్న చిత్రం 1.1 సినిమా తేజకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఆర్ పీ పట్నాయక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news