ప్రేమించి పెళ్ళిచేసుకుని… ఆ తర్వాత వేధించి..చిత్రహింసలు పెట్టి..!

-

మొదట మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లాడిన భర్త ఆ తర్వాత వేధించి చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం లోని కందూరు గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. తుడు వారి పల్లెకు చెందిన ఓబులేషు మౌనిక ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఆరు నెలల కూతురు ఉన్నారు. పెళ్లి చేసుకున్న నాటి నుండి మౌనికను భర్తతోపాటు అత్త ఆడపడుచులు వేధించడం మొదలు పెట్టారు.

పెళ్లయి 5 ఏళ్లు గడుస్తున్నా మౌనిక కు వేధింపులు తప్పలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మౌనిక అమ్మమ్మ లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్ల కొడుకు ఆరు నెలల కుమార్తె తల్లి కోసం ఏడవడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news