శ్రీ వారి సన్నిధిలో “శిలువ” గుర్తు కలకలం

-

శ్రీ వారి సన్నిధి అయిన తిరుమల లో.. క్రైస్తవ మతానికి సంబంధించిన శిలువ గుర్తు కలకలం రేపింది. దర్శనానికి వచ్చిన ఓ ఇండికా కారు పై శిలువ గుర్తును గమనించకుండా… తిరుమలకు అనుమతించారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.

తనిఖీ సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయని విజిలెన్స్ సిబ్బంది.. శిలువ గుర్తు ఉన్న ఆ ఇండికా కారు.. తిరుమల కు అనుమతించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కారు వెనుక అద్దంలో ”శిలువ గుర్తు., ave Maria’’ అనే అన్యమత శ్లోకంతో తిరుమలకు వచ్చింది కారు. అయితే ఇది గమనించిన.. కింది స్థాయి అధికారులు.. టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కారు ను పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తెలంగాణ రాష్ట్రానికి కు చెందిన భక్తులుగా గుర్తించారు. శిలువ గుర్తును తొలగించి కారును భక్తులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. దీంతో ఆ భక్తులు అక్కడి నుంచి వెళ్ళి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news