ఏపీ పోలీస్ శాఖలో విషాదం.. షటిల్ ఆడుతూ సీఐ మృతి !

-

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సి ఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. అది కూడా ఆడుతూ భగవాన్ ప్రసాద్ కుప్పకూలడం సంచలనంగా మారింది. ఆయన కుప్పకూలుతున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ కావడంతో మరింత విషాదం నెలకొన్నట్టు అయింది.

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఎప్పటిలాగే విధులు పూర్తిచేసుకుని నిడమర్రు మండలం భువనపల్లిలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. సీఐకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ మరణ వార్త తెలియగానే పలువురు పోలీసు అధికారులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news