జేసీపై మీసం మెలేసీన సీఐ..నేడు వైసీపీ గూటికి

-

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై ఓ సందర్భంలో మీసం మెలేసిన కదిరి మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో శనివారం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… రాజకీయం అనేది కొందరి చేతుల్లోనే ఉంది బలహీనవర్గాల్లో నాయకత్వం పెంపొందించాలి, అలాంటి వారికి రాజకీయన్నా దగ్గర చేయాలనే సంకల్పంతోనే వైసీపీ అధినేత ఆహ్వానం మేరకు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైందన్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమం విషయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా…అయితే నాడు పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ మీసం మెలేసి పోలీసు పవరేంటో అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news