నారాయణపేట జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. రంగంలోకి ఎస్పీ యోగేష్ గౌతమ్

-

నారాయణపేట జిల్లా కేంద్రంలో జెండా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అది కాస్త రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ రంగంలోకి దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే గురువారం జిల్లా కేంద్రంలో భారీ పోలీసుల మధ్య ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రం ప్రధాన రహదారి మీదుగా బలగాలను మోహరించారు. మల్టీ జోన్ -2 ఐజి సత్యనారాయణ, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ జిల్లా కేంద్రంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. యువత ముఖ్యంగా సంయమనం పాటించాలని, అనవసరమైన గొడవలకు వెళితే చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల ద్వారా జెండా వివాదం అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version