రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి మంగళవారం వెళ్లనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విమానంలో ఢిల్లీ వెళ్తారు.అక్కడి నుంచి నేరుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళనున్నారు.

ఆయనతో భేటీలో రాష్ట్రానికి సంబందించిన విషయాలపై చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు.రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలవనున్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు హస్తినకు పయనం కానున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news