హరీష్ రావుతో ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారు :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

-

తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే మాజీ మంత్రి హరీష్ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన సోమవారం ఓ వీడియో విడుదల చేశారు.కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారని అన్నారు.

హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నదని అన్నారు.అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు.హరీష్రావు పై వచ్చిన పొగడ్తలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్ధిస్తారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ నేతల వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మక్కైయ్యాయని స్పష్టంగా అర్ధమవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news