రేపు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు.ఈ క్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) పోలవరం పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 11.45 గంటలకు పోలవరానికి చంద్రబాబు రానున్నారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్షిస్తారు.

మధ్యాహ్నం 3.10 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరనున్నారు.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ కూడా దర్శించేవారు.అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత సదరు ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది… నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పే వారే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కరువయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news