CM Chandrababu’s warning to MLAs: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..ఇచ్చారు. ఎవరు ఏం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉందని బాంబు పేల్చారు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12న అమరావతిలో కార్యక్రమం లో ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు… చంద్రబాబు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు 2000 కు… రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రూపాయలు జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.