కడప జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పర్యటన.. షర్మిలా కూడా

-

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. అంతేకాదు ఇడుపులపాయలో సీఎం జగన్ తో పాటు రేపు షర్మిల కూడా పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కు నివాళులు అర్పించానున్నారు. ఆ తర్వాత పులివెందుల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సిఎం జగన్. అనంతరం పులివెందుల నుండి ఇడుపులపాయకు రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ వెళ్లనున్నారు.

ఆ తర్వాత వైఎస్సార్ వ్యవసాయ క్షేత్రంలోనే రాత్రికి ముఖ్యమంత్రి జగన్ బస చేయనున్నారు. ఇక ఎల్లుండి బద్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం కడప నగరంలో సీఎం జగన్ పర్యటన ఉండనుంది. ఈ సందర్బంగా సీపీ బ్రౌన్ పనులకు శంకుస్థాపన మరియు మహావీర్ సర్కిల్ ప్రారంభ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. -ఆ తర్వాత కడప విమానాశ్రయం నుండి గన్నవరానికి తిరుగు పయనం కానున్నారు సిఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Latest news