ఇసుక పాలసీపై నేడు సీఎం జగన్ సమీక్ష..

-

బుధవారం ఉదయం 10.30కి ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదులలో కాలుష్యం.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఎన్జీవోలతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30కి పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన పథకంపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఇసుక కొరత తీవ్రమైన నేపథ్యంలో చేపడుతున్న చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. కాగా, వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో వరదలు తగ్గుముఖం పడితే ఇసుక కొరత లేకుండా చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news