సీఎం జగన్ గుడికి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ?

-

శ్రీకాళహస్తి పట్టణ శివారులో జగనన్న నవరత్నాల గుడి పేరిట ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించిన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చేపట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ ఆలయ నిర్మాణం ఉంది. జగనన్న ఇళ్ల పథకం కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఈ గుడిని నిర్మించారు. రెండు జిల్లాల మంత్రులతో ఈ గుడి ప్రారంభోత్సవం జరిగింది.

Cm jagan temple cost
Cm jagan temple cost

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి…. జగన్ అన్న అంటే తనకు విపరీతమైన అభిమానం అని తెలిపారు. తల్లిదండ్రులు, భార్య పిల్లల కన్నా తనకు జగన్ అన్నే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అలాగే మొదటిసారి ఓడిపోయినా తనకు మళ్లీ టికెట్ ఇచ్చి జగన్ గెలిపించాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునే అందుకే ఈ ఆలయ నిర్మాణం చేపట్టానని తెలిపారు. అయితే తాజాగా ఈ గుడి నిర్మాణం గురించి ఒక ఆసక్తిరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ గుడి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్త బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news