ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే..!

-

నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో 20 అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా వర్గీకరించనున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా గవర్నమెంట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇసుక సరఫరా మరింత పెంచే అంశంపై ఏపీ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

JAGAN
 

ఇసుక కొరత తీర్చేందుకు ఉపకరించే చర్యలతోపాటు.. అక్రమాలకు తావు లేకుండా మరో కీలక నిర్ణయం తీసుకోనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇసుక అక్రమాలను నియంత్రించేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రత్యేక వ్యవస్థను ఇసుక సంబంధించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఏర్పాటుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానుల ఏర్పాటు.. తరలింపు అంశంతోపాటు.. కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల పైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news