ఫ్యామిలీ తో సిమ్లా వెళ్లనున్న సిఎం జగన్

-

అమరావతి : ఈ నెల 28 వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక మైన రోజు. ఎందుకంటే ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు. అంతే కాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వివాహమై ఈ నెల 28 వ తేదీ కి 25 ఏళ్ళు నిండనుంది. ఈ నేపథ్యం లో ఓ స్పెషల్ టూర్ ప్లాన్ చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

సిల్వర్ జూబ్లీ దినోత్సవం సందర్భం గా నాలుగు రోజుల పాటు కుటుంబం తో గడి పేందుకు వెళ్ళనున్నారు సీఎం జగన్. ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాల్లో గడపేందుకు వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్. అయితే నాలుగు రోజుల టూర్ ను ఫ్యామిలీ తో వెళ్లాలని ప్లాన్ చేశారు సిఎం జగన్. ఈ మేరకు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యేక పైన విమానం లో వెళ్లాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news