నేటి నుంచి క‌డ‌ప‌, క‌ర్నూల్ జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాల ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌నున్నారు. వైఎస్సార్ క‌డ‌ప‌తో పాటు క‌ర్నూల్ జిల్లాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. నేడు సాయంత్రం గ‌న్న‌వరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒంటిమిట్ట కు వెళ్తారు. అక్క‌డ నేడు జ‌ర‌గ‌బోయే శ్రీ సీత‌రామ‌లను ద‌ర్శించుకుంటారు. ప్ర‌భుత్వం నుంచి పట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పింస్తారు. అలాగే నేడు ఒంటిమిట్ల‌లో జ‌రిగే.. శ్రీ సీత‌రాముల క‌ళ్యాణ ఉత్స‌వాన్ని తిల‌కిస్తారు.

cm jagan

అనంత‌రం క‌డ‌ప‌లోనే రాత్రి బ‌స చేస్తారు. 16వ తేదీ ఉద‌యం క‌డ‌ప జిల్లాలో ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు అవుతారు. దీని త‌ర్వాత క‌ర్నూల్ జిల్లాకు చేరుకుంటారు. క‌ర్నూల్ ఒక వివాహ వేడుక‌కు హాజ‌ర‌వుతారు. అనంత‌రం 16 వ తేదీ సాయంత్రం వ‌ర‌కు తాడేపల్లి చేరుకుంటారు. కాగ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ఏర్పాడిన త‌ర్వాత తొలిసారి సీఎం వైఎస్ జ‌గ‌న్ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news