ఈ నెల 7 న ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

-

ఈ నెల 5, 7వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. వైజాగ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే సమావేశానికి పారిశ్రామిక వేత్తలు 2000 మంది హాజరుకానున్నారని తెలిపారు.

రానున్న రోజుల్లో వైజాగ్‌ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించనన్నారని ఆయన వెల్లడించారు. రూ. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లిలో వైయస్సార్ చేయూత సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రిలీజ్ చేయనున్నారు. అనంతరం అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news