తమిళ సై భర్తకు సీఎం కేసీఆర్ సన్మానం..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త కు సన్మానం చేశారు. ఇటీవలే రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భర్తకు సన్మానం చేసి ఒక అరుదైన బహుమతిని కూడా ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతకీ అసలు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భర్తకి సీఎం కేసీఆర్ ఎందుకు సన్మానం చేశారు అని అంటారా.

తెలంగాణ గవర్నర్ తమిళ సై భర్త డాక్టర్ సౌందరరాజన్ ఇటీవలే నెఫ్రాలజిస్ట్ గా సేవలు చేసినందుకుగాను ధన్వంతరి అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సౌందరరాజన్ అభినందించేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక అక్కడ గవర్నర్ తమిళిసై భర్త సౌందరరాజన్ ను కలిసి కాసేపు మాట్లాడారు సీఎం కేసీఆర్. సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు దక్కడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళసై భర్త డాక్టర్ సౌందరరాజన్ ను అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… అభినందించారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news