ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది మేమే, ఎనీ డౌట్స్ : కేసీఆర్

-

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా మించిన ఉత్సాహంతో ప్రచారాలలో పాల్గొంటూ పార్టీని గెలిపించడానికి కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే ఎనీ డౌట్స్ అంటూ తాము ఈ నగరానికి ఏమి చేశామో చక్కగా ప్రజలకు వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ కు మేము నాలుగు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చాము, ,మోదీ రెండు పర్యాయాలుగా కరీంనగర్ కు ఏమి చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ నగరానికి ఏమి చేశారో ? మా ప్రభుత్వంలో కరీంనగర్ ఒక నగరంలా రూపుదిద్దుకుంది అంటూ కేసీఆర్ చెప్పారు.

అందుకే కరీంనగర్ లో ఇంకా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్, బీజేపీ లను నమ్ముకోకుండా BRS కు ఓటేయాలని కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా కేవలం పదమూడు రోజులు మాత్రం ఉండగా ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news