పొలిటికల్ హీట్ : మరోసారి పీకేతో సీఎం కేసీఆర్ భేటీ..

-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సారి తెలంగాణతో పాటు.. జాతీయ రాజకీయాలపైన కూడా దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్.. అయితే.. ఇప్ప‌టికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప‌లుసార్లు స‌మావేశ‌మై రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 18న కేసీఆర్, ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోసారి భేటీ కానున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ వారి భేటీ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.

Talk: K Chandrashekar Rao Paid 500 Crore For Prashant Kishor

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న‌ రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు పీకే నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ కు వివ‌రాలు తెల‌పనున్న‌ట్లు స‌మాచారం. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వీరు స‌మావేశం నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల‌పై కూడా వారు చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news