దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం..అమిత్‌ షా కు తలసాని సవాల్‌

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టిఆర్ఎస్ సిద్ధమని సవాల్‌ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా ఏదైనా మాట్లాడుతమంటే చెల్లదని.. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదని ఫైర్‌ అయ్యారు.

మంత్రి పదవులు అన్ని కేసీఆర్ కుటుంబానికి అన్న అమిత్ షా… మిగతా మంత్రులకు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదామని సవాల్‌ విసిరారు. మీరు గెలుస్తారో, మేము గెలిస్తామో ప్రజలు నిర్ణయిస్తారని ఛాలెంజ్‌ చేశారు.

గుజరాత్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని.. కళ్ళుండి చూడలేని కాబోదులు బీజేపీ నాయకులు అని విమర్శించారు తలసాని. గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాజకీయ నాయకులు ఎవడేవడో ఏమో మాట్లాడుతున్నారని.. ఎండాకాలం 24 గంటల కరెంటు ఎప్పుడైనా చూశామా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news