రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌నున్న సీఎం..కార‌ణం ఇదే..!

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సీఎం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రియు హోంశాఖ మంత్రి అమిత్ షాతో స‌మాశేశ‌య్యారు. కాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రేపు ( సోమవారం) కలిసే అవకాశం ఉంది. ఈ సంధ‌ర్బంగా షెకావ‌త్ తో సీఎం ఏపీ తెలంగాణ మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదం పై చ‌ర్చించ‌నున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అంతే కాకుండా కేసీఆర్ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ను కూడా కలిసి యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా ఢిల్లీలో సీఎం ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణ శంకుస్థాపన కోసం సీఎం వ‌చ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news