మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా… తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఇంటికి వెళ్లి… సీఎం కేసీఆర్‌ ఆయనను పరామర్శించారు. అనంతరం.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌… తల్లి శాంతమ్మ కు నివాళులు అర్పించారు. శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి… వారితో మాట్లాడారు సీఎం కేసీఆర్‌. కాగా.. మంత్రి శ్రీనివాస్ ఇంట…. అక్టోబర్‌ 30 వ తేదీన విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు మాతృ వియోగం కలిగింది. మంత్రి తల్లి శాంతమ్మ గుండె పోటు తో హైదరాబాద్‌ లో అక్టోబర్‌ 30 వ తేదీన రాత్రి మృతి చెందారు. గత కొంత కాలం నుంచి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి.. అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news