రేపు కారణజన్ముడు సిద్దిపేటకు వస్తున్నాడు – హరీష్ రావు

-

రేపు కారణజన్ముడు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటకు వస్తున్నాడన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట లో రేపు జరగనున్న సీఎం కేసీఆర్ సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. కారణజన్ముడు రాక కోసం ఎదురు చూస్తుంది సిద్దిపేట గడ్డ అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కాగా, నిన్న హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వేదిక‌గా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల శంఖారావాన్నిపూరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హుస్నాబాద్‌ అన్నాదమ్ముళ్లు, అక్కచెళ్లలకు నమస్కారాలు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించాం. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను మీ దర్శనానికి వచ్చాను. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్దు. పట్టణంలో బస్తీలో, గ్రామానికో, తండానికో పోయిన తర్వాత కేసీఆర్‌ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాలి’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news