సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలో కలుస్తాడు – సీఎం కేసీఆర్

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమోనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నారాయణపేట సభలో వణికిపోయారని అన్నారు.ఎవ‌డు ఎప్పుడు పోయి బీజేపీలో క‌లుస్త‌డో.. ముఖ్య‌మంత్రే జంప్ కొడుతడో.. ఏమైత‌దో తెలియ‌ని ప‌రిస్థితి అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలో తేలిపోయిందని అన్నారు.

పోలీస్ సోదరులారా.. మేము అన్ని రికార్డ్ చేస్తున్నాం.తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు .మీరు మారకుంటే.. ప్రజలే తిరగబడే రోజు వస్తది.బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు, దౌర్జన్యాలు, మితిమీరిన పనులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news