రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్ గాడు – కేసీఆర్

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీపుట్ గాళ్లకి కూడా అధికారం వస్తుంది అని అన్నారు.ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్ గాడు అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిద్దిపేట రైతులను ఆదర్శంగా తీసుకొని.. రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు రాయాలి అని సూచించారు. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేయాలని.. ఎండిన పంటలకు ఎకరానికి ₹25,000 నష్టపరిహారం ఇవ్వాలని.. పంటలకు ₹500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి అని కేసిఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news