సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

-

ఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్ణాటక సీఎంగా ఉన్న యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆయన ఢిల్లీ పెద్దల తో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజా.. దేశ ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై వారు చర్చించారు.

కావేరీ జలాల వివాదం మరియు కేరళ- కర్ణాటక మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం అందుతోంది. అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే.. ఆయన తన రాజీనామా ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం.

ప్రధాని తో భేటీ అనంతరం.. బిజేపి జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా ను కలిసిన కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప… రాజీనామా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పారని… ఈ విషయాన్ని మోడి దగ్గర ప్రస్తావించినట్లు అమిత్ షా తో చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చేందుకు బిజేపి అగ్ర నాయకత్వం మొగ్గు చూపితే, జులై 26వ తేదీ వరకు ఆ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news