అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహంలో మెరిసిన సీఎం జ‌గ‌న్‌..

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేత, వ్యాపారవేత్త అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధూవరులను అయన ఆశీర్వదించారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే.

ఇందులో అయోధ్యరామిరెడ్డి వ్యాపార రంగంలోకి వెళ్ళగా, రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అయోధ్యరామిరెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news