మరోసారి 30 ఇయర్స్ పృథ్వీ రాజ్‌ ఆడియో వైరల్ !

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎన్నికల్లో ఆడియో లీకుల ప్రకంపనలు రేపుతున్నాయి. ‘మా’ ప్రతినిధులకు విష్ణు పానెల్ నటుడు పృథ్విరాజ్ వార్నింగ్ ఇచ్చినట్లు… ఓ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఆడియో లో ప్రకాష్ రాజ్ ను సన్మానించడాన్ని పృధ్వీరాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌ను ఇటీవల సన్మానించారు విశాఖకు చెందిన ఏపీ ‘మా’ సభ్యులు.

ప్రకాష్ రాజ్‌కు సన్మానం చేయడం బాధనిపించిందని వారిపై మండిపడ్డారు పృథ్విరాజ్‌. పాతి కేళ్లు గా ఓటు వేయని వ్యక్తి ప్రకాష్ రాజ్ అని… కోవిడ్ సమయంలో తాము ఇంటింటికి తిరిగి సేవలు చేశామన్నారు పృథ్వి. అంతేకాదు.. కరోనా బాధితులకు బెడ్‌లు ఇప్పించామన్నారు. ఇన్ని సేవలు చేస్తే తెలుగు వాడు అధ్యక్షుడిగా వద్దా ? అతడికి సన్మానం చేయడమేంటని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటుడు పృధ్వీరాజ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news