కమ్యూనిజం ప్రమాదకరమైనదే.. కానీ అది మోదీ, బీజేపీలకు మాత్రమే – డి.రాజా

-

ఆర్ఎస్ఎస్, బిజెపి సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలి అనేది కమ్యూనిస్టుల ముందు ఉన్న పెద్ద సవాల్ అన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. కమ్యూనిజం అనేది అత్యంత ప్రమాదకరమైనది అని మోడీ చెబుతున్నారని.. మేం కూడా అదే అంటున్నాం.. కమ్యూనిజం అత్యంత ప్రమాదకరమైనదే కానీ అది మోదీ, బిజెపిలకు మాత్రమే ప్రమాదకరమైనది అని అన్నారు.

మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం తీసుకురావాలని కుట్ర జరుగుతోందన్నారు డి రాజా. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు బిజెపి పూర్తి విభిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే అదాని, మోడీ సంబంధం బయటకి వస్తుందని తెలిసి వేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు అన్ని సెక్యూరి గారు పార్టీలు ఒక తాటిపైకి రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news