ఆ అభ్యర్థిని మోదీయే పోటీ నుంచి తప్పించారు : అభిషేక్ మను సింఘ్

-

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన ఓ తిరుగుబాటు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ ప్రధాని మోదీ ఎమోషనల్ బ్లాక్​మెయిల్​ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించింది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి ప్రస్తావించారు.

కంగ్రా జిల్లాలోని ఫతేపుర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయొద్దంటూ ఓ నేతను మోదీ ఫోనులో మానసికంగా బెదిరిస్తున్నారని అభిషేక్ సింఘ్వి తెలిపారు. ‘‘పరిపాలన కంటే బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి ఎన్నికల ప్రచారం ఇష్టమైన కార్యక్రమంగా ఉంది’’ అని సింఘ్వి పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో తమ ప్రాబల్యం కోల్పోతోందని తెలుసుకున్న బీజేపీ అభద్రతభావంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. “గౌరవనీయులైన ప్రధానమంత్రి కార్యాలయం .. ఒక ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఇలాంటి స్థాయికి దిగజారుతుందా? దీనిపై తీర్పు చెప్పే బాధ్యతను దేశానికి వదిలివేస్తాము” అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news