మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణలో 5 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికి ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి.

మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి,పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు లోక్సభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news